Friday, November 26, 2010

భాగ్యనగరంలో ఒక రోజు భాగ్యం.

ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక సంస్థ వారు ఒక రోజు నగర పర్యటన అని ఒక రూ.270 /- తో నగరంలో ఎంపిక చేసిన ప్రదేశాలని చూపించారు. ముందుగా ఉదయం 8 :30 కి తెలుగు తల్లి విగ్రహం నుండి బయలుదేరి ముందుగా "బిర్లా మందిరం". పైకి వెళ్లటానికి ఒక ౩౦౦ మెట్లు, జోరున వాన, వెళ్తే తడవటం ఖాయం. అందుకని అక్కడ నుండి "సాలార్ జుంగ్ సంగ్రహాలయం"కి వెళ్ళాము. ప్రపంచం నలు మూలల నుంచి తెచ్చిన ఎన్నో వస్తువులు అక్కడ ఉన్నాయి. నిశితంగా అన్ని చూడటానికి ఒక రోజంతా పడుతుంది. కానీ మాకు కేవలం ఒక గంట మాత్రమే ఉంది. అన్నింటిలోకి నా మనసు దోచింది మాత్రం "రిబకా" అని పిలవబడే పాల రాతి శిల్పాలు. చాల ఆశ్చర్యభరితంగా చెక్కారు. అందరు ఇంగ్లాండ్ నుంచి తెచ్చిన గంట గడియారం చాల బాగుంది అన్నారు కానీ, నాకు మాత్రం ఎందుకో అస్సలు నచ్చలేదు.




       అక్కడ నుంచి "నిజాం సంగ్రహాలయం". వైశాల్యంలో చాల చిన్నదైన చూడాల్సిన వస్తువులు చాల ఉన్నాయి. ముఖ్యంగా 1950కి ముందు తీసిన చిత్రాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నిజం రాజులు ఎంత విలాసంగా బతికారో నాకు రెండు సంగ్రహాలయాలు చూసిన తర్వాత తెల్సింది.


అక్కడ నుంచి "చౌ మెల్ల భవనం". ఇది చాల విలాసంగా అందంగా ఉంది
            


        
అక్కడ నుంచి "నెహ్రు జంతు సంరక్షణశాల". అన్ని రకాల జంతువులను అరగంటలో చూపించారు. అక్కడి నుంచి పర్యాటకశాఖ వారి భోజన శాలకు వెళ్ళాము.ఆ భోజనశాల గండిపేట్ ఉస్మాన్ సాగర్ దగ్గరలో ఉంది. రూ౬౫/- కి చక్కని భోజనం పెట్టారు. అసలు ఆ భోజనాన్ని చూస్తేనే కడుపు నిండి పోయింది. బహుశా వాళ్ళు పెట్టిన భోజనం కూడా నిజాం ప్రభువుల కాలం నాడు వండినది అనుకుంట. రెండు మెతుకులు తిని బతుకు జీవుడా అంటూ బయట పడ్డాం.అప్పటికి సమయం సాయంత్రం ౪:౩౦ అయింది.

 గోల్కొండ కోట మా తదుపరి గమ్యం. అక్కడ చూస్తె అన్ని పాడుబడ్డ గోడలు, పిచ్చి మొక్కలు. మాతో వచ్చినతను ఆ కోట గురించి తనదైన శైలిలో చెప్పాడు. రామదాసు చరసాల అందులో చూడదగ్గ ప్రదేశం.


అటు నుంచి సాయంత్రం ఏడు గంటలకు "లేజర్ షో" ఆకట్టుకున్నది. అక్కడ ఉన్నంత సేపు ఇంతకూ మునుపు జరిగిన బాంబు దాడి గుర్తొచింది.



 మొత్తానికి రాత్రికి ఇంటికి చేరే సరికి ఒళ్ళంతా పులిసిపోయింది.


Tuesday, November 23, 2010

తమిళ భాషాభిమానం?

ఇటీవలే విడుదల అయిన "రొబో" అనే అరవ చిత్రం మనము అందరమూ చూశాము. చాలా బాగుంది అని నాలుగు, ఐదు సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలానే ఇంతకు ముందు వచ్చిన "గజినీ","శివాజీ", "అపరిచితుడు" ఇలా అరవ చిత్రాలు అన్నింటిని వరుసగా ఆదరించాము. రజనీ నుంచి నిన్న వచ్చిన సూర్య వరకు తమిళ హీరోలు అందరు మనకు తెలుసు. కానీ ఎన్ని తెలుగు చిత్రాలు అక్కడ ప్రదర్శిస్తున్నారు. కనీసం "పోకిరి", "మగధీర", లాంటి వాటినైన అక్కడ చూశారా? అసలు తమిళనాడు లో ఎంత మందికి చిరంజీవి, బాలకృష్ణ తెలుసు? మన చిత్రాలు వాళ్ళు ఎందుకు చూడరు? మన వాళ్ళు గొప్ప చిత్రాలు తీయలేదా? నేను మొన్న ఆ మధ్య ఒక నెల రోజులు అక్కడ ఉన్న. నేను బాగా గమనించింది ఏంటంటే అక్కడ వాళ్ళు మాతృ భాషనూ ఎంతగానో ప్రేమిస్తారు. ముఖ్యమంత్రి కరుణానిధి నుంచి ప్రతి ఒక్కరు తమిళ భాష మీద ఎనలేని ప్రేమ చూపిస్తారు. దీనికి చక్కటి ఉదాహరణ ఇటీవల అక్కడ జరిగిన తమిళ మహాసభలు. ఎంత ఘనంగా చేశారంటే దేశం మొత్తం ఆశ్చర్య పోయేలా చేశారు. ఆ తమిళ సభల గురించి అక్కడి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటే నాకు సిగ్గేసింది. వాళ్ళ మధ్యన ఉన్న ఐకమత్యం, మాతృ భాష మీద వాళ్ళకున్న ప్రేమ మనకు మచ్చుకుడా లేదు. మాతృభాష కన్నతల్లి తో సమానం. తెలుగును మర్చిపోతే తల్లిని మరచినట్లే.  తెలుగు వారందరం తెలుగే మాట్లాడదాం. "జై తెలుగు తల్లి ! జై జై తెలుగు తల్లి"

"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు రేడ నేను తెలుగొకండ
యెల్లవారు వినగ యెరుగవే బాసాడి
దేశ భాష లందు తెలుగు లెస్స "



Tuesday, November 16, 2010

కష్టం అంటే ఏంటో తెలుసా ???

చచి చెడి ఎలాగోలా ఆ నాలుగేళ్ళు పాస్ ఐతే , తీర మార్కులేమో అరవై కన్నా రావు. మనతో పాటు చదివిన వాళ్ళందరికీ ఏదో ఒక దాంట్లో ఉద్యోగం వస్తుంది.మనకు మాత్రం ఉద్యోగం రాదు. ఇలాంటి పరిస్తితుల్లో ఇంటికి కొంత మంది వస్తుంటారు.వీళ్ళను ఏమి చేసిన పాపం లేదు. వీళ్ళు ఎవరంటే , ఇంతకూ క్రితమే భూమి పుటక ముందు నుంచి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, లక్షలు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు. వీళ్ళు ముందు ఇంటికి వచ్చి నాలుగు పిచ్చి మాటలు చెప్తారు. వాళే మగాళ్ళు అనట్టు. వాళ్ళు ఏది చెప్తే వాళ్ళ ఆఫీసులో అదే జరుగుతుంది. మీ వాడి వివరాలు పంపించండి నేను చూసుకుంటాను అని చెప్తారు.ఇంట్లో వాళ్ళకేమి తెల్సు, వాడు జేఫ్ఫాగాడు అని., వివరాలు పంపించు అంటారు. మనం పంపిస్తాం. అంత బాగానే వుంటుంది. అసలు కధ ఇప్పుడు మొదలు అవుతుంది. వాడికి అసలు అక్కడ అంత సీను వుండదు. దానిని కప్పిపుచ్చటానికి " మీ వాడికి అరవై మార్కులే వచాయి, మా దాంట్లో కనీసం డెబ్బై ఐన వుండాలి అన్నారు., అందులోను ఇంగ్లిష్లో మన వాడు వీక్" అని ఇలా ఏవేవో చెప్తాడు.ఆ డెబ్బై మార్కులు వస్తే వాడిని ఎందుకు అడుగుతాం,మనకే రాదా ఉద్యోగం.??? వాడిని బతిమిలాడాల??? దీనితో ఇంట్లో వాళ్ళు గుర్తు తెచ్చుకొని మరీ మళ్ళి తిట్టటం మొదలు పెడతారు., సరిగ్గా చదవమంటే చదవలేదు అని. ఇంతకీ నేను అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే., మీకు ఉద్యోగం వుంది, మీరు గొప్పోల్లు., కాదు అని అనటం లేదు., మీకు చేతనైతే సహాయం చేయండి.,లేదంటే నాలుగు మంచి మాటలు చెప్పండి. అంతే కాని., మా జీవితాలతో ఆడుకోవద్దు. ఆ క్షణంలో తెలుస్తుంది కష్టం అంటె ఏంటో