Friday, November 26, 2010

భాగ్యనగరంలో ఒక రోజు భాగ్యం.

ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక సంస్థ వారు ఒక రోజు నగర పర్యటన అని ఒక రూ.270 /- తో నగరంలో ఎంపిక చేసిన ప్రదేశాలని చూపించారు. ముందుగా ఉదయం 8 :30 కి తెలుగు తల్లి విగ్రహం నుండి బయలుదేరి ముందుగా "బిర్లా మందిరం". పైకి వెళ్లటానికి ఒక ౩౦౦ మెట్లు, జోరున వాన, వెళ్తే తడవటం ఖాయం. అందుకని అక్కడ నుండి "సాలార్ జుంగ్ సంగ్రహాలయం"కి వెళ్ళాము. ప్రపంచం నలు మూలల నుంచి తెచ్చిన ఎన్నో వస్తువులు అక్కడ ఉన్నాయి. నిశితంగా అన్ని చూడటానికి ఒక రోజంతా పడుతుంది. కానీ మాకు కేవలం ఒక గంట మాత్రమే ఉంది. అన్నింటిలోకి నా మనసు దోచింది మాత్రం "రిబకా" అని పిలవబడే పాల రాతి శిల్పాలు. చాల ఆశ్చర్యభరితంగా చెక్కారు. అందరు ఇంగ్లాండ్ నుంచి తెచ్చిన గంట గడియారం చాల బాగుంది అన్నారు కానీ, నాకు మాత్రం ఎందుకో అస్సలు నచ్చలేదు.




       అక్కడ నుంచి "నిజాం సంగ్రహాలయం". వైశాల్యంలో చాల చిన్నదైన చూడాల్సిన వస్తువులు చాల ఉన్నాయి. ముఖ్యంగా 1950కి ముందు తీసిన చిత్రాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నిజం రాజులు ఎంత విలాసంగా బతికారో నాకు రెండు సంగ్రహాలయాలు చూసిన తర్వాత తెల్సింది.


అక్కడ నుంచి "చౌ మెల్ల భవనం". ఇది చాల విలాసంగా అందంగా ఉంది
            


        
అక్కడ నుంచి "నెహ్రు జంతు సంరక్షణశాల". అన్ని రకాల జంతువులను అరగంటలో చూపించారు. అక్కడి నుంచి పర్యాటకశాఖ వారి భోజన శాలకు వెళ్ళాము.ఆ భోజనశాల గండిపేట్ ఉస్మాన్ సాగర్ దగ్గరలో ఉంది. రూ౬౫/- కి చక్కని భోజనం పెట్టారు. అసలు ఆ భోజనాన్ని చూస్తేనే కడుపు నిండి పోయింది. బహుశా వాళ్ళు పెట్టిన భోజనం కూడా నిజాం ప్రభువుల కాలం నాడు వండినది అనుకుంట. రెండు మెతుకులు తిని బతుకు జీవుడా అంటూ బయట పడ్డాం.అప్పటికి సమయం సాయంత్రం ౪:౩౦ అయింది.

 గోల్కొండ కోట మా తదుపరి గమ్యం. అక్కడ చూస్తె అన్ని పాడుబడ్డ గోడలు, పిచ్చి మొక్కలు. మాతో వచ్చినతను ఆ కోట గురించి తనదైన శైలిలో చెప్పాడు. రామదాసు చరసాల అందులో చూడదగ్గ ప్రదేశం.


అటు నుంచి సాయంత్రం ఏడు గంటలకు "లేజర్ షో" ఆకట్టుకున్నది. అక్కడ ఉన్నంత సేపు ఇంతకూ మునుపు జరిగిన బాంబు దాడి గుర్తొచింది.



 మొత్తానికి రాత్రికి ఇంటికి చేరే సరికి ఒళ్ళంతా పులిసిపోయింది.


No comments:

Post a Comment